మాయా శంఖం
జపాను
జానపద కథ
మాయా శంఖం
జపాను
జానపద కథ
అనగా అనగా ఉత్తర
జపానులో ఒక దీవిలో
ఒక రైతు ఉండేవాడు . అతడు పేదవాడు ,కానీ
ఎంతో నిజాయితీపరుడు . అతడి పేరు హోదెరీ .
ఒకజమిందారి తోటలో అతడు పనిచేసేవాడు .
ప్రతిరోజు అతడు ఎంతో కష్టపడవలసి వచ్చేది .
కానీఅతడు ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు .
ప్రతిరోజూ తన గుడిసె నుండిజమిందారు
భవనానికి సముద్ర తీరం వెంట నడిచి వెళ్లేవాడు .
అలా వెళుతూ పైకి లేచి , పడి , మళ్లీలేచే
అలలను చూడటం అతడికి ఇష్టంగా ఉండేది .
సముద్రపు తీరంలోని మడుగులలోని చిన్న
చిన్న సముద్ర జీవులను చూసి అతడు
సంతోషించేవాడు .
View Pager
ఒక ఉదయం ఒక చేపని మడుగులోకి తరిమిన
ఒక పెద్ద చేపని పొదెరీ చూశాడు . అతడు పెద్దగా
చప్పట్లు కొట్టేసరికి ఆ పెద్ద చేప వెళ్లిపోయింది . ఆ చిన్న
చేప మళ్లీసముద్రంలోకి వెళ్లలేక ఆ మడుగులోనే
ఈదుతూ ఉంది .
“నిన్ను మళ్లీసముద్రంలోకి వదిలిపెడతాను, ”
అన్నాడు హొదెరీ .
ప్రేమతో ఆ చిన్న చేపను తీసి సముద్రంలో
వదిలాడు . “ ఆ పెద్ద చేపకుదొరకకుండా తొందరగా
వెళ్లిపో , ” అన్నాడు .
అంత ఉదయమేఒక మంచి పని చేసినందుకు
అతడికి ఎంతో సంతోషంగా ఉంది . నాలుగు అడుగులు
వేశాడో లేదో అతడికి వెనక నుంచి మాటలు
వినిపించాయి, “ కొంచెం ఆగండి . ”
వెనక్కి తిరిగిన హొదెరి అందమైన బట్టలతో ,తాను
అంతకు ముందెన్నడూ చూడని దేవతలాంటి అందమైన
స్త్రీ కనిపించింది . తన లాంటి పేదవాడితో ఆమెకి పని
ఏమిటని తనదారినతాను వెళ్లసాగాడు .
కానీ ఆ
అనిపిలిచింది , “ కొంచెం ఆగండి .
సముద్రపురాజు ఒకే ఒక కూతురిని మీరు కాపాడారు .
మా నాన్న దగ్గరికి మిమ్మల్ని తీసుకెళతాను. ”
“కానీనాకు ఈత రాదు . నేనురాలేను , ” హొదెరీ
అమాయకంగా అన్నాడు . ఆ యువతి నవ్వుతూ , “ నేను
పెద్ద చేపగా మారతాను. మీరు వచ్చి నా వీపు మీద
కూర్చుంటేచాలు, ” అంది .
హొదెరీ సముద్రపు ఒడ్డుకు వచ్చాడు . ఆమెపెద్ద
చేపగా మారింది . అతడు ఆమె వీపు మీద కూర్చున్నాడు .
ఆ చేప ఈదుకుంటూ సముద్రపురాజు దగ్గరకు తీసుకుని
వెళ్లింది .
లు
సముద్రపురాజు తన దర్బారులో ఉన్నాడు . హోదెరీనీ
తీసుకొచ్చిన చేప అతడు అంతకు ముందు చూసిన అమ్మాయి
కంటే అందంగా మారి రాజు పక్కన నిలబడి ఉంది . తన కూతురు ,
ప్రాణంకాపాడినందుకు పొదెరీకి రాజు వంగి నమస్కరించాడు .
రాజకుమారి కురులు పట్టు మబ్బుల లాగా గాలిలో
తేలుతున్నాయి . ఆమెబట్టలు అలల లాగా ఉన్నాయి . ఆమె
గొంతు జలతరంగిణిలాగా తియ్యగా ఉంది . “ నా ప్రాణాలు
కాపాడినందుకు వేలవేల దండాలు, ” అంది రాజకుమారి . “ ఒక
వేళ ఆ చేప నుంచి తప్పించుకున్నా ఆ మడుగులోంచి
బయటపడ గలిగే
దానిని కాదు . ”
హొదెరీ ఎంతో వినయంగా , “ ఈ సహాయం నేను ఎవరికైనా
చేస్తాను , ” అన్నాడు. హోదెరీనిగౌరవించటానికిరాజు విందు
ఇచ్చాడు . కళాకారులు పాటలు పాడారు, నృత్యాలు చేశారు .
అందరూ సంతోషంతో సంబరాలు
జరుపుకున్నారు . అప్పుడు
రాజు, “ నా కూతురినికాపాడినందుకు నీకొక బహుమతి
ఇవ్వాలని ఉంది . నీకు ఏది కావాలంటే అది కోరుకో , ” అన్నాడు .
ఎవరికైనా సహాయం చెయ్యగలగటమే
బహుమతిగా హొదెరీ
భావిస్తాడు . అదే అతడికి సంతోషాన్ని ఇస్తుంది . అంతకు మించి
అతడు ఏమీకోరుకోడు . అదే అతడురాజుతో చెప్పాడు . అయితే
రాజు అందుకు ఒప్పుకోలేదు .
అప్పుడు ఏదెరీ నలువైపులా చూసి , “ మహారాజా , అలా
అయితే నాకు ఆ శంఖం ఇప్పించండి , ” పాలతెలుపులో
మెరిసిపోతున్న శంఖాన్ని చూపిస్తూ అన్నాడు .దాంతో దర్బారు
అంతా నిశ్శబ్దం ఆవరించింది .
“ అది మాయా శంఖం , అది తప్పించి వేరే ఏమైనాకోరుకో , ”
అన్నాడు మహారాజు. “ అలాగయితే ఆ శంఖం మీ దగ్గరే
ఉండాలి, మహారాజా . నాకు ఏ బహుమతీ వద్దు , ” అన్నాడు
హొదెరీ .
రాజు కొంచెంసేపు ఆలోచించాడు . తరువాత , “ నా కూతురు
ప్రాణాలుకాపాడిన నీకు ఏదీ ఇచ్చినా తక్కువే,” అన్నాడు .
సేవకుడు తెచ్చి ఇచ్చిన శంఖాన్ని హొదారీకి బహుమతిగా
ఇచ్చాడురాజు .
to
ఆ శంఖంతో హొదెరీని తిరిగి సముద్రం ఒడ్డుకు
చేర్చారు . అతడికి వీడ్కోలు చెబుతూ , “ ఈ మాయా
శంఖం నీజీవితాన్ని సంతోషాల్లో నింపుతుంది . దీని
సహాయంతో నువ్వు అన్ని ప్రాణుల మాటలు అర్థం
చేసుకోగలవు. అయితే దీనిని స్వార్థపరుల చేతిలో
పడనివ్వకూడదు , ” అంది .
హొదెరీజమిందారు ఇంటివైపుకిబయలుదేరాడు .
దారిలో ఒక చెట్టుమీద పక్షుల కిలకిలలు వినపడ్డాయి
మాయా శంఖాన్ని పరీక్షించటానికిదానిని తన చెవి
దగ్గర పెట్టుకున్నాడు హొదెరీ . ఆ పక్షుల మాటలు
అతడికి వినిపించాయి. “
తామేతెలివైన వాళ్లమని
మనుషులు అనుకుంటారు ,కానీ
వాళ్లకి ఏమీ
తెలియదు . ఈ చెట్టు కింద ఉన్నరాయి నిజానికి
బంగారపు ముద్ద , ” ఒక పక్షి అంది .
ఆ పక్షుల మాటలు విని పొదెరీ ఆశ్చర్యపోయాడు .
నాచుతో కప్పి ఉన్న ఒక
రాయి ఆ చెట్టు కింద అతడికి
కనిపించింది . ఆరాయిని తీసి నాచుని తొలగించే సరికి
అది బంగారం అని అర్థమయ్యింది .దానిని హొదెరీ తన
చొక్కా లోపలదాచుకున్నాడు .
జమిందారు ఇంటికి చేరుకునే సరికి అక్కడ అంటించి
ఉన్న ఒక ప్రకటన అతడికి కనిపించింది , నా కూతురు
జబ్బు నయం చేసిన వ్యక్తికి అతడుకోరుకున్న
బహుమతి ఇస్తాను.
తోటలో తిరిగుతుండగాజమిందారు కూతురిని
హొదెరీచాలాసార్లు చూశాడు . అందమైన బట్టలలో ఆమె
ఎప్పుడూ నవ్వుతూ ఉండేది .పిట్టలకు గింజలు వేస్తూ
ఉండేది .
ఆమెకి ఇంద్రధనస్సురాకుమారి అని తన
మనస్సులో హొదెరీ పేరు పెట్టుకున్నాడు .
ఇప్పుడు ఆమెకేజబ్బు చేసింది . హొదెరీ ముఖంలో
మొదటిసారి విచారం కమ్ముకుంది . ఆమెకి సహాయం
చెయ్యాలని నిశ్చయించుకున్నాడు .
లోపలికి వెళ్లి “ మీ కూతురుజబ్బుని నేను నయం
చేస్తాను ,” అని అతడుజమిందారుతో చెప్పాడు .
అతడి మాటలు విని అక్కడున్న ప్రముఖ
వైద్యులందరూ నవ్వారు. “ మాకే ఏం అంతుపట్టటం లేదు , నీ
వల్ల ఏమవుతుంది ?” అని అతడిని ఎగతాళిచేశారు .
జమిందారుకి తన కూతురు అంటే ప్రాణం . తన
కూతురికి నయం అయ్యి , ఎప్పటి లాగా తిరుగుతూ
ఉండాలని అతడి కోరిక . ఏ చేతిలో ఏ మహిమ ఉందో ఎవరికి
తెలుసు ?
“ఆమెను పరీక్షించి ఏం చెయ్యాలో చెప్పు,” అని
హొదెరీని ఆదేశించాడుజమిందారు .
లోపల గదిలో ఇంద్రధనస్సురాకుమారి పడుకుని ఉంది .
ఆమె
చాలా నీరసంగా ఉంది .
చాలా కష్టంగా ఊపిరి
తీసుకుంటోంది .
తన మాయా శంఖం సహాయం చేస్తుందని హొదెరీదానిని
తన చెవి దగ్గర పెట్టుకున్నాడు . అయితే చుట్టుపక్కల
ఎటువంటి పక్షి లేదా జంతువు , చివరికి పురుగు కూడా
లేకపోవటంతో అతడికి ఏమీ వినిపించలేదు .దాంతో
రాకుమారికి ఏం అయ్యిందో అతడికి తెలియలేదు .
అతడు నిరాశగాజమిందారు దగ్గరకు వచ్చాడు .
“ ఇప్పుడు నాకు ఏమీ తెలియటం లేదు . తెలియగానేమళ్లీ
వస్తాను , ” అని హొదెరీ చెప్పాడు .
వైద్యులు నవ్వుతుంటే తల దించుకుని వచ్చేశాడు
హొదారీ . తోటలో పనిచేస్తున్నా అతడికి ఒక్క పక్షి కూత కూడా
వినిపించలేదు . పొదల్లో ఉండే తొండ కూడా కనిపించలేదు .
నీటి మడుగు దగ్గర ఎప్పుడూ ఉండే కప్ప అరుపైనా
వినపడుతుందేమోనని పొద్దుగుంకే వరకు అతడు పనిచేశాడు .
ఆకాశంలో చుక్కలు కనిపించటంతో పొదెరీ ఇంటికి
బయలుదేరాడు . అప్పుడు గుడ్లగూబ అరుపు
వినిపించింది . వెంటనేమాయా శంఖాన్ని చెవి దగ్గర
పెట్టుకోవటంతో దాని మాటలు అర్థంకాసాగాయి ,
“జమిందారు ఇంటి కప్పు నేసేటప్పుడు అందులో ఒక
పాము ఇరుక్కుపోయింది .
దానిని బయటకు తీసి
ఆహారం ఇచ్చేవరకు అమ్మాయిజబ్బు నయంకాదు. ”
శంఖాన్ని లోపల
దాచిపెట్టి హొదారీజమిందారు
దగ్గరకు వెళ్లాడు . “ మీ అమ్మాయికి ఏంజరిగిందో నాకు
తెలిసింది , ” అతడు చెప్పాడు . “ఆమె మీద పాము
ప్రభావం పడింది . ఇంటి పైకప్పు నేసిన గడ్డిలో
చిక్కుకున్న పామును రక్షించి ,
దానికి ఆహారం
ఇవ్వాలి. ”
ఆ మాటలకు వైద్యులందరూ మళ్లీపెద్దపెట్టున
నవ్వసాగారు .
కూతురి మీద ప్రేమతో ఏది చెయ్యటానికైనా
జమిందారుసిద్ధంగా ఉన్నాడు. “కప్పు నేసేవాళ్లను
వెంటనే
పిలిపించండి , ” అంటూ మనుషులను
పంపించాడు .
ఆ
రాత్రేకప్పు నేసేవాళ్లు ఇంటి కప్పుని
ఊడదియ్యటం మొదలు పెట్టారు. కొంచెం సేపటికి గడ్డిలో
చిక్కుకున్న పాము కనిపించింది . ఆకలికి అది సగం
చచ్చి ఉంది .
జమిందారు స్వయంగా దానికి ఆహారం ఇచ్చాడు .
పాముకి ఓపికరావటంతో ఆ అమ్మాయి కూడా లేచి
కూర్చుంది .
పాముకి మరికొంత ఆహారం ఇవ్వమనిజమిందారు
చెప్పాడు .పాము మెల్లగా పాకటం మొదలుపెట్టటంతో
ఇంద్రధనస్సురాకుమారి కూడా నవ్వుతూ బయటకు
వచ్చింది .
జమిందారు ఎంతో సంతోషించాడు . హోదెరీ దగ్గరకు వెళ్లి
తన కూతురి ప్రాణాలుకాపాడినందుకు అతడుకోరుకున్నది
ఏదైనా ఇస్తానని అన్నాడు .
దయ హోదెరీ గుణం, ఇతరులకు సహాయ పడటమే
అతడికి సంతోషం. ఇతరుల సుఖమేఅతడికి బహుమతి .
అందుకే అతడు , “ నాకు ఏకోరికా లేదు , ” అన్నాడు . అయితే
మొదటిసారి అతడి మాటలలో నిజాయితీ లోపించింది .
అన్నిటికి మించి అతడురాకుమారినికోరుకున్నాడు మరి .
ఏదో ఒకకోరిక ఉండే ఉంటుంది అనిజమిందారు ఒత్తిడి
చేసిన మీదట , దయ , అందం మూర్తీభవించిన
రాకుమారివైపు చూసి , “ మీ అమ్మాయితో పెళ్లి
జరిపించాలని
కోరుకుంటున్నాను,” అన్నాడు .
అక్కడ ఉన్న వైద్యులందరూ నవ్వారు . “ నిరుపేద
అయిన ఇతడికి నీ కూతురిని ఎలా ఇస్తావు ?” అన్నారు .
జమిందారు నిజాయితీపరుడు ,కాసేపు ఆలోచించాడు .
అ
చివరికి , “ నా కూతురిని నా లాగా చూసుకోగలనంటే
నీకిచ్చి పెళ్లిచేస్తాను, ” అన్నాడు .
అతడి మాటలు విన్న వైద్యులు మరింతగా నవ్వారు .
మురికి బట్టల ఆ రైతురాకుమారిని సంతోషంగా ఎలా
ఉంచగలుగుతాడు ? నవ్వి , నవ్వి వాళ్ల పొట్టలు నొప్పి
పుట్టసాగాయి .
అప్పుడు హొదారీ తన బట్టలలో దాచిన బంగారు
ముద్దనుబయటకు తీశాడు . “ నీకూతురు , మాపిల్లలు
ఎల్లకాలం సుఖ , సంతోషాలతో ఉండటానికి ఇది
సరిపోతుందని అనుకుంటున్నాను, ” అన్నాడు .
ఆ వైద్యుల నవ్వులు ఆగిపోయి బంగారు ముద్దవైపు
కళ్లార్పకుండా చూడసాగారు .
జమిందారు మాత్రం నవ్వి ,
“ సరిపోతుంది , ” అంటూ తన అంగీకారం తెలిపాడు .
ఇంద్రధనస్సురాకుమమారితో హొదెరీ పెళ్లి
జరిగింది .
జమిందారు ఇంట్లోనే
వాళ్లిద్దరూ
సంతోషంగా ఉండసాగారు .
ప్రతి రోజు ఉదయం హోదెరీ, అతడి భార్య
తోటలోని పందిరి కింద కూర్చునేవాళ్లు .
తమతోపాటుచాలా గింజలు తీసుకెళ్లిపిట్టల
కోసం వేసేవాళ్లు . ఎవరూ తమని గమనించకుండా
ఉండటానికి వాళ్లు సూర్యోదయం కంటే ముందే
లేచి ఒకరి తరువాత ఒకరు మాయా శంఖాన్ని
చెవి దగ్గర పెట్టుకుని అన్ని ప్రాణుల మాటలు
వింటూ ఉండేవాళ్లు .